పోసాని కేసులో కొత్త మలుపు! బెయిల్ మంజూరు.. కానీ విడుదలకు బ్రేక్!
Wed Mar 12, 2025 09:29 Politics.202503124656.jpg)
సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి బెయిల్ (Bail) మంజూరు అయింది. అయితే జైలు నుంచి విడుదలకు బ్రేక్ (Release Delayed) పడింది. పోసానిపై సిఐడి పోలీసులు (CID Police) పీటి వారెంట్ (PT Warrant) వేశారు. ఈ క్రమంలో పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలుకు గుంటూరు సిఐడి పోలీసులు వెళ్లారు. పీటీ వారెంట్పై పోసానిని కోర్టులో హజరుపర్చనున్నారు. కర్నూలు జైలు నుంచే ఆన్ లైన్లో సీఐడీ పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు. కాగా ఇప్పటికే అన్ని కేసులలో పోసానికి బెయిల్ మంజూరైంది. తాజాగా సీఐడీ పోలీసుల పీటి వారెంట్తో పోసాని విడుదలకు బ్రేక్ పడింది. మరోవైపు పోసాని కృష్ణమురళిని వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీసులు స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు కోసం విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ నెల 3న అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్జైలు నుంచి పీటీ వారెంట్పై పోసానిని తీసుకువచ్చిన నరసరావుపేట పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. దీంతో న్యాయస్థానం పోసానికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సమగ్రంగా విచారించేందుకు పోసానిని వారం రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈ నెల 3నే పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం రెండు రోజులపాటు(ఈ నెల 8, 9 తేదీల్లో) పోసానిని నరసరావుపేట 2 టౌన్ పోలీసుల కస్టడీకి అనుమతించింది. అయితే, ఆ రెండు రోజుల్లో విజయవాడ భవానీపురం పోలీసులు పోసానిని పీటీ వారెంట్పై తీసుకువెళ్లడంతో పోలీస్ కస్టడీకి తీసుకోవడం సాధ్యపడలేదు. దీంతో తాజాగా మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! 30 వేల మంది పైలట్లు అవసరం..
ఇక కర్నూలు జైల్లో ఉన్న పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులోనూ పోసానికి బెయిల్ లభించింది. ఆదోని అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ ఇన్చార్జి మెజిస్ర్టేట్ అపర్ణ మంగళవారం బెయిల్ ఆదేశాలు జారీ చేశారు. కాగా పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు అయింది. మంగళవారం ఆయనకు కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 2024, నవంబర్ 14వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని త్రీ టౌన్లో పోలీస్ స్టేషన్లో పోసానిపై జనసేన నేత రేణు వర్మ ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఆయనపై బీఎన్ఎస్ 353(1),353(2),353(సి)సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో మార్చి 5వ తేదీ నుంచి పోసాని కర్నూలు జైలులో ఉన్నారు. మరోవైపు విజయవాడలోని చీఫ్ జ్యూడిషియల్ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు.ఇటీవల పీటీ వారెంట్పై కోర్టులో పోసానిని హాజరుపర్చగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నేడు పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యూడిషియల్ కోర్టు సైతం బెయిల్ మంజూరు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం.. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ) చైర్మన్గా నియమించింది.
ఇది కూడా చదవండి: వర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!
ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర అభ్యంతరకర భాషతో విరుచుకు పడ్డారు. ఈ నేపథ్యంలో పోసానిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని పోసానిని.. ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీకి తరలించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కావడంతో.. ఒకే కేసులో పోసానికి బెయిల్ మంజూరు అయితే.. మరో కేసులో ఆయన అరెస్ట్ అవడం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అదీకాక పోసానికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ ప్రభుత్వం తరుఫు న్యాయవాదులు కోర్టుల్లో వాదిస్తున్నారు. ఆయన ఈ విధంగా మాట్లాడడం వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై విచారణ జరగాల్సి ఉందని కోర్టుకు వారు స్పష్టం చేస్తున్నారు. అలాంటి వేళ.. పోసానికి బెయిల్ మంజూరు అయింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!
టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!
అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!
రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!
జేఈఈ మెయిన్ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!
ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #posani #bail #release #break #todaynews #flashnews #latestnews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.